Monday, May 13, 2013

Letter of Luck

2 comments



పరీక్షలముందు హడావిడి కే.జి నుండి పి.జి దాకా కనబడేదే!దూరాన ఉన్న పిల్లలకు Best of Luck చెప్పాలంటే ఫోను చేస్తాము.అదే మనవరాలికి చెప్పాలంటే,అదీ లేఖ రూపంలో అయితే,ఇదిగో  ఇలా....

Hi, Avni , How are  you?

When I talked to your mom I came to know that you are busy studying for your exams.Happy to hear that you are entering into sixth class next year.Well you will also have your Graduation ceremony this year. We are happy to have a grand daughter like you who depends on industry rather than luck in preparing for the exams. Good dear kid, Luck always follows  the hard worker. On your entry to the Kinder   Garten  it appears that you have come across a  first stepping stone in your life to mould  yourself as a student in the class but dear don’t forget that it  is a concrete step for your future milestones in your career not only as a student but also as an adorable  human being.Your parents provide you the base and the teachers help you to lay the pillars of success. Now the structure is ready but the remaining part is in your hands to make it a master piece. Avni dear , We wish you all success in your examinations  as well as your career.We both wish that success and luck always  be as co-travellors to you in the berth (birth) of life and pray  God to enable luck to sing the lullaby of success to get through in all walks of life. Bye ! With love and blessings.                        
                                         Grandpa and Grandma
                              

Sunday, May 12, 2013

అమ్మానమామి!

5 comments



చక్కెర పేరు చెప్తే తియ్యదనాన్ని నాలుక చెప్తుంది. అమ్మ పేరు చెప్తే ప్రేమదనాన్ని మనసు చెప్తుంది.

మాతృమూర్తులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

Tuesday, May 7, 2013

దీపతోరణం

5 comments



                     రచన వృత్తి కావచ్చు,ప్రవృత్తి కావచ్చు కాని రచన చేసే వ్యక్తికి మాత్రం రచన  మానసికోల్లాసాన్ని అందిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.స్పందించే మనసులో అలలై ఎగిసిపడే సృజనాత్మక భావాలను  రసాత్మకంగా ఏర్చికూర్చి ఒకచోట పేర్చితే తప్ప అలోచనా కడలి శాంతించదు. రచన మనసునుండి వెలువడేదాక మనసు ఊరుకోదు. రచయితను నిలువనీయదు.
          
               బాల్యంలో మొదలైన  చందమామ, బాలమిత్ర, బుజ్జాయివంటి పుస్తకాల పఠనం రచనాసక్తిని పెంచడంలో దోహదపడిందనే చెప్పాలి. ఊహ తెలిసేనాటికి ఎందరో రచయితలు, రచయిత్రులు, రచించిన విభిన్నరచనలను కథలు, నవలలు,ధారావాహికలుగా (వార,మాస పత్రికలలో) చదవడం మనసునుండి మరలిపోని నిత్యానుభూతి.
               
               వందమంది రచయిత్రుల కథానికల సంకలనమే  దీపతోరణం. సాహితీ చిరపరిచితులు వాసా ప్రభావతి, పొత్తూరి విజయలక్ష్మి,స్వాతి శ్రీపాద, తమిరిశ జానకి గార్లు వెయ్యి పుటల ఈ పుస్తకానికి సంపాదకవర్గంగా నాలుగు స్థంభాలై నిలిచారు. నిత్య కథాయజ్ఞంలో  అలుపెరుగని వేదగిరి రాంబాబుగారు ఈ సంకలనానికి ప్రచురణ బాధ్యత స్వీకరించడం హర్షణీయం. కథాభిమాని వేదగిరి రాంబాబుగారికి  శతమానం భవతి. అంతేకాదు ఈ కృషిలో ప్రత్యక్షంగా,పరోక్షంగా సహకరించిన వారందరు అభినందనీయులే.
        
   దీపతోరణంలో అఖండదీపాల నడుమ నా రచన కూడా ఓ చిరుదివ్వెగా చోటు చేసుకోవడం నా రచనాభిలాషకు మరింత స్ఫూర్తిదాయకం.

Sunday, May 5, 2013

గుండు ధైర్యం

2 comments
     


        నిజమే,గుండు క్రింద నిలబడాలంటే గుండు ధైర్యం అదే గుండె ధైర్యం కావాలనిపించింది.చిత్తూరు జిల్లా,కలికిరి మండలం, మహల్ బహుశ ఆ పరిసరప్రాంతాలకు చెందినవారికే పరిమితం కావచ్చుకాని, అమెరికాలో, లండన్ లో చాలా సంవత్సరాలకు పూర్వమే మహల్  నుండి వెళ్లి స్థిరపడినవారు,అక్కడ ఉద్యోగాలలో చేరి నిలదొక్కుకున్నవారు గుండె ధైర్యం కలవారే! బహుశ బలంగా వీచిన ఆ కొండగాలేనేమో!

              మహల్, గుండ్లూరు నడుమ కనిపించి కనువిందు చేసినదే ఈ గుంటివీరుని కొండ. నిజానికి ఆ గుండుకెంత ధైర్యం! మనమైతే అలా బ్యాలెన్స్ లేకుండా నిలబడగలమా! ఆ గుండు సంగతి తెలిసినవారు దాని వయసు వందేండ్ల పైచిలుకే అంటారు.

               మనవరాలు   వచ్నినపుడు సైట్ సీయింగ్ కు  ఎక్కడికెళ్దామంటే " I want to see places where you have spent your childhood days". అనడంతో జీవితం చరమగీతం  పాడకముందే ఒకసారి నడయాడిన  పరిసరాలను తనివిదీరా చూచి రావాలని ఏ మూలనో ఒదిగివున్న కోరిక ఒక్కసారిగా పెల్లుబికింది.
                 
                   ఇకనేం, ఎడతెగని కారు ప్రయాణం! ఉత్సాహం అలసటను తలెత్తనివ్వలేదు. పల్లెలలో స్పష్టమైన మార్పు కనబడుతోంది. నాగరికత, సాంకేతికత జుగల్ బందీయై పల్లెలను  కొత్తగా చూపిస్తున్నాయి.
నాటి బాలలే నేటి వృద్ధులన్నట్లు నెరసిన బాల్యం పలకరించింది.ఆకాశంలో అక్కడక్కడా ఒక చుక్కలా కొందరు ఉన్నారు.మరికొందరు చుక్కల్లోనే కలిసిపోయారు. ఆనందపు జల్లులు ఒకవైపు మనసును పులకింపచేసినా తలచుకున్న బాంధవ్యాలు  కనుమరుగయ్యాయని తెలిసినపుడు గుండె చెమ్మగిలక మానదు. కాని మహల్ కు కిలోమీటరు దూరంలోనున్న గుంటివీరుని కొండ దానిపై ఏ క్షణంలో పడిపోతుందోనని భయం కలిగించే గుండు మాత్రం అన్నిటికీ సాక్షీ భూతమై నేటికి చెక్కు చెదరక నిలబడి ఉండడం చూస్తే మనిషికి ప్రకృతి పాఠం నేర్పుతుంది అంటారనేమాట నిజమేననిపించక మానదు.మొక్కవోని ధైర్యమే మనిషికి ఆలంబనై ముందుకు నడిపిస్తుందనడం తథ్యం.



Wednesday, May 1, 2013

మానవత్వం ఎక్కడ?

4 comments

ఈ రోజు  (1-5-2013) ఆంధ్రభూమిలో ప్రచురింపబడ్డ నా వ్యాసం.

http://www.andhrabhoomi.net/content/m-503


        జీవనయానంలో బ్రతుకంతా మారథాన్ రేస్ లా మారిపోతున్న నేటి తరుణంలో మానవత కాగడా పెట్టినా వెతికినా దొరకని వస్తువులా మృగ్యమయే పరిస్థితి  ఏర్పడింది.ఈ దుస్థితి నానాటికీ అధికమవుతోంది. ఇటీవల  మనమంతా నోటమాటరాక టి.విలకు కళ్లప్పచెప్పి గాంచిన  సంఘటనలనే తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. నడిరోడ్డుపై ప్రమాదానికి గురైనపుడు సహాయం కోరి ఆక్రందనలు చేసినా కరగని కసాయితనాన్ని, పసిపాపపై పాశవిక దాడిని గురించి ప్రసారమాధ్యమాలద్వారా చూసి తెలుసుకున్నాక మానవత్వమా ఏదీ నీ చిరునామా?’ అని వెతకాల్సి వస్తోంది.
                
         తరాల అంతరాలు ఒకవైపు,వృత్తిలో ముందుండాలనే ఆరాటం మరొకవైపు సాటి మనిషి గురించి కనీసం కాస్తయినా ఆలోచించలేకపోవడం  మానవత చిరునామానే గల్లంతు చేసేస్తోంది. యంత్రాలకు సైతం విశ్రాంతినిస్తాం. కాని మనుషులే మానవ యంత్రాలుగా రాత్రి,పగలు పరిశ్రమిస్తూ, తమ జీవితాలలో తామేం మరచిపోతున్నామో గ్రహించలేని స్థితికి చేరుకున్నారు.మరి అలాంటివారికి, మనిషి అంటే మానవత్వానికి మరోపేరు అని అ,ఆలనుండి నేర్పినా వినే తీరిక ఉంటుందా అంటే? సందేహమే!
           
       జీవితానికి అర్థమేమిటి అని   చరమాంకంలో ప్రశ్నార్థకం పలికేకన్నా జీవితాన్ని అర్థవంతంగా  మలచుకోవడం  మానవజీవితంలో మానసిక వికాసం మొగ్గతొడిగిననాడే మొదలవాలి.  విలాసవంతమైన జీవితానికి తగినన్నివనరులు, అవకాశాలు,అయినా ఏదో శూన్యం, వెలితి, నిరాశ! ట్రెడ్ మిల్ పై ఎడతెగని నడకలా నిద్రలేచింది మొదలు నిద్రించే వరకు జీవితమంతా పరుగుకే కేటాయిస్తే మిగిలేదేమిటి?గతం వద్దు గత అనుభవాల పాఠాలు మాకొద్దు, భూతకాలంలో ఏమవుతుందో అనే దిగులెందుకు? వర్తమానంలో సుఖపడటమే ముఖ్యమనుకునే వారి మాటలలోనే చెప్పాలంటే ఎంజాయ్ చేయడమే జీవిక అనుకుంటే మనిషి ఉనికికే అర్థంలేదు. మరణించాక కూడా మన ఉనికిని తెలిపేది మన నడవడే. మనం నాటిన మైలురాళ్లు ముందు ముందు శిలా ఫలకాలై వాటిపై మనిషిగా మనం నడయాడిన తీరు లిఖించబడి కీర్తించబడుతుంది.

ప్రపంచమే పెద్ద యంత్రాగారమై మనుషులు మరమనుషులై హృదయాలను మరచిపోతే కరుణ స్థానంలో కార్పణ్యం చోటుచేసుకుని, మనిషిని స్వార్థపు హాలాహలంలో కరిగించి  మనీషిగా రూపుదిద్దుకోనీయదు. విచక్షణ లోపించినపుడు పైన పేర్కొన్నఅమానుష కార్యాలు చర్వితచర్వణమే! అందుకే మానవీయ విలువలకు బాల్యంలోనే పునాది వేయగలగాలి. మానవత్వపు ఛాయలో విద్యాబోధన జరగాలి. విశాలదృక్పథం సన్నగిలి బుద్ధి కుచించుకుపోతే సుగుణాలు ఆవిరై దుర్గుణాలు పాతుకుపోతాయి. మనసులు ఇరుకైనచోట మనుగడ కష్టం. అందుకే తల్లి ఒడిలో నేర్వవలసిన తొలి పాఠం మానవత్వమే!  అది నేర్వనినాడు మనిషితనానికి అర్థమే మారిపోతుంది.